Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

BREAKING : ఉప్పొంగిన గోదావరి.. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!

BREAKING : ఉప్పొంగిన గోదావరి.. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

గోదావరి నది ఉప్పొంగుతుంది. భద్రాచలం వద్ద 48 అడుగులకు గోదావరి చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు గోదావరి ఉపనదుల నుంచి గోదావరి నదిలోకి ప్రవహిస్తున్నాయి. దాంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా మధ్యాహ్నం వరకు 48 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి మరింత వరద పోటెత్తనున్నది. ఇప్పటికే ధవలేశ్వరం ప్రాజెక్టు 75 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీకి నీటి వరద పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి 8 లక్షల 68 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది.

గోదావరి నది ఉపనదులు కూడా వరద నీటితో ఉప్పుపొంగుతున్నాయి. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం పుష్కర ఘాట్ ల వద్ద స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. చర్ల – దుమ్ముగూడెం మండలంలో వాగులు పొంగుతున్నాయి. చర్ల – గుంపల్లి మధ్య ఈత వాగు పొంగడంతో రహదారిపై వరదనీరు చేరుతుంది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో ఆరు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి : 

Srishailam : శ్రీశైలంకు భారీ వరద.. 27 గేట్ల ద్వారా జూరాల నుంచి దిగువకు నీటి విడుదల.. లేటెస్ట్ అప్డేట్..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!

మరిన్ని వార్తలు