క్రీడాకారులు రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలి

క్రీడాకారులు రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలి

క్రీడాకారులు రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలి

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, మన సాక్షి:

క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జాతీయస్థాయిలో రాణించాలని
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.మహేశ్వరం మండల కేంద్రంలో ప్రసిద్ద గడికోట మైదానంలో చీఫ్ మినిస్టర్ కప్ 2023 మండల స్థాయి క్రీడా పోటీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా అన్ని సౌకర్యాలతో పాటు ప్రతి గ్రామంలో,మండల స్థాయిలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు.

 

క్రీడా తెలంగాణగా రాష్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడల్లో విశేష ప్రతిభ చూపి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలని మంత్రి క్రీడాకారులకు పిలుపునిచ్చారు.

 

క్రీడలంటే పాఠశాల,కళాశాల స్థాయిలోనే కాకుండా ఆయా గ్రామాల్లో ఉండే యువజన సంఘాలను కూడా క్రీడల్లో భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు.వేసవిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోటీలు నిర్వహిస్తుంటారు…వారికోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ తో ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానము ఉండేలా చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.

 

నిరుద్యోగ యువతకు స్కిల్ డేవలెప్మెంట్ కు ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కంపెనీలు రాగా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.

 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి,క్రీడాకారుల డ్రెస్ లను అందజేశారు. టాస్ వేసి వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎంపీపి రఘుమా రెడ్డి, వైస్ ఎంపీపి సునీత ఆంధ్య నాయక్, మార్కెట్ కమిటీ చెర్మన్ సూరసాని సురేందర్ రెడ్డి, చేర్మన్ పాండు యాదవ్,ఆలయ చెర్మన్ సుదీర్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సెక్రటరీ గుండెమోని అంజయ్య ముదిరాజ్,బీసి నియోజకవర్గం అధ్యక్షులు మల్లేష్ యాదవ్,

 

చంద్రయ్య,, కూన యాదయ్య, మద్ది సురేఖ కర్ణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ నాయక్,ఎన్ డి తండా రాజు నాయక్, మంత్రి రాజేష్,మండల ఎస్టి సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, డైరెక్టర్ పోల్కం బాలయ్య
ఎంపీడీవో నరసింహులు ఎమ్మార్వో మహమూద్ అలీ, మహేశ్వరం ఎసిపి అంజయ్య, అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.