Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hrinadh Goud :  చేపమందు హరినాథ్ గౌడ్ కన్నుమూత

Hrinadh Goud :  చేపమందు

హరినాథ్ గౌడ్ కన్నుమూత

హైదరాబాద్ , మనసాక్షి :

చేపమందు అందించిన హరినాథ్ గౌడ్ మృతి చెందాడు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరినాథ్ గౌడ్ అనారోగ్యం తీవ్రమవడంతో నిన్న మృతి చెందారు.
బత్తిని హరినాథ్ గౌడ్ చేప ఔషధంగా భావిస్తారు.
కొద్ది రోజుల క్రితం ఆయన మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

 

 

బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు గత కొన్నేళ్లుగా చేప మందు ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లోని నాంపల్లి థియేటర్‌కు సోదరులు అందిస్తున్న చేపమందు కొనుగోలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి ఆస్తమా బాధితులు వస్తుంటారు.

 

Also Read : 

నల్లగొండ  : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!

 

బత్తిని హరినాథ్ గౌడ్ కు భార్య సునీత్రాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గతంలో బస్తీ దూద్ బౌలి ప్రాంతానికి చెందిన ఐదుగురు బత్తిని సోదరులు శివరాం, సోమ లింగం, విశ్వనాథ్, హరినాథ్ గౌడ్, ఉమా మహేశ్వర్ తమ నివాసాలను పాత బస్తీ దూద్ బౌలి నుంచి భోలక్‌పూర్ పద్మశాలి కాలనీకి మార్చారు.

మరిన్ని వార్తలు