క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

ప్రియురాలను హత్య చేసి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.. వెలుగులోకి సంచలన నిజాలు..!

విశాఖలోను గాజువాక లో ప్రియురాలిని హత్య చేసిన విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రియురాలను హత్య చేసి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు.. వెలుగులోకి సంచలన నిజాలు..!

మన సాక్షి :

విశాఖలోను గాజువాక లో ప్రియురాలిని హత్య చేసిన విషయంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2021 లో మౌనిక ను డేటింగ్ యాప్ ద్వారా నేవీ అధికారి రవీంద్ర పరిచయం పెంచుకున్నాడు. 2024 లో అతడికి వేరే అమ్మాయితో పెళ్లి కుదరడంతో పెళ్లి చేసుకున్నాడు. అయినా కూడా మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో తన ప్రియురాలు మౌనిక ను ఇంటికి పిలిపించుకున్నాడు.

వీరి మధ్య ఎప్పటినుంచో గొడవ తలెత్తడంతో పథకం ప్రకారమే రవీంద్ర ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు. పథకం ప్రకారమే ఆమెను గొంతు పిసికి హత్య చేసి మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు ముక్కలు చేశాడు. తల, చేతులను అడవి వరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లొ పెట్టి కాళ్ళను సూట్ కేసులో పెట్టాడు. అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని గాజువాక పోలీసులు తెలిపారు.

 

ఇవీ చదవండి

మరిన్ని వార్తలు