Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

పంచాయతీ కార్యదర్శులు ఆత్మగౌరవ పోరాటం – కోదండరాం

పంచాయతీ కార్యదర్శులు ఆత్మగౌరవ పోరాటం – కోదండరాం

సూర్యాపేట , మనసాక్షి

గ్రామపంచాయతీ లలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని రెగ్యులరైస్ చేయాయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

.తమను రెగ్యులర్ చేయాలంటూ గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న పంచాయతీ సెక్రటరీలు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన శాంతి దీక్షకు ఆయన సంఘీభావం చెబుతూ పంచాయతీ సెక్రెటరీ పోరాటం ఆత్మగౌరవ పోరాటమని చాలీచాలని జీతంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ వ్యక్తి జాకీర్ నౌకరి చేస్తున్నారని ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రెగ్యులర్ చేయాలని కోరారు.

 

పంచాయతీ సెక్రటరీల శ్రమతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయని ఆయన అన్నారు రాష్ట్రంలో నియంత్రితో పాలన నడుస్తుందని ఆయన విమర్శించారు వారి సమస్యలకు ప్రత్యేక ద్వారా పరిష్కరించకపోగా సమ్మె విరమించాలని వివిధ రూపాల్లో ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని స్వామికి చర్య ఉన్నారు.

 

ఇప్పటికైనా పంచాయతీ సెక్రెటరీ చర్చలు జరిపి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు లేనట్లయితే మరి పోరాటానికి మద్దతుగా వివిధ పక్షాలను కూడగట్టి గ్రామస్థాయిలో వేల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు . అనంతరం దీక్షా శిబిరం వద్ద సెక్రట్రిలు చేపట్టిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల సంఘ నాయకులు తో పాటు తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ రాష్ట్ర నాయకులు గట్ల రమాశంకర్ జిల్లా అధ్యక్షుడు మల్లయ్య ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షుడు యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారగోని కిరణ్ సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ పార్టీ నాయకులు సుమన్ నాయక్ యాకూబ్ రెడ్డి లోకేష్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు