Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

జనాధారణ పొందుతున్న మన సాక్షి దినపత్రిక… తహసిల్దార్..!

జనాధారణ పొందుతున్న మన సాక్షి దినపత్రిక… తహసిల్దార్..!

పెన్ పహాడ్ ప్రతినిధి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయంలో సోమవారం తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ మన సాక్షి దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు జర్నలిస్టులు ముందు ఉంటారని అన్నారు. నేటి సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమైందని సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికల పాత్ర చాలా కీలకమైంది అన్నారు.

విశ్వాసనీయ సమాచారాన్ని అందించే పత్రికల్లో మన సాక్షి పత్రిక ముందుంది అన్నారు. యాజమాన్యానికి పెన్ పహాడ్ మండల విలేఖరి చెరుకుపల్లి నాగేశ్వరరావుకు తాసిల్దార్ శుభాకాంక్షలు తెలిపారు పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు అని పేర్కొన్నారు. వివిధ పత్రికలలో పని చేసే జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. చాలా తక్కువ సమయంలోనే లక్షలాదిమంది ఆదరణను మన సాక్షి పత్రిక సంపాదించుకుందన్నారు.

ఈ కార్యక్రమంలో, పెన్ పహాడ్ మండల విలేఖరి చెరుకుపల్లి నాగేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు రంజిత్ రెడ్డి, ఆజి జున్నిస, సీనియర్ అసిస్టెంట్ రాదా ,జూనియర్ అసిస్టెంట్ రాధా , కంప్యూటర్ ఆపరేటర్ తండ శివ, సలీం, ఎం పి ఎస్ ఓ రాధ, పుష్ప అజీర్ నజీర్ సునీత రికార్డ్ అసిస్టెంట్ సైదులు, సైదమ్మ, యేసు, గురవయ్య, పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు