ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి.. (వీడియో)
ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి.. (వీడియో)
మన సాక్షి :
దీపావళి పండుగ రోజు విషాద సంఘటన నెలకొన్నది. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ని ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..
ఏలూరు తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్ పై ఇద్దరు వ్యక్తులు ఉల్లిగడ్డ బాంబుల మూట తీసుకొని వెళ్తున్నారు. అయితే బైకు అదుపుతప్పి గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలకు తగలడంతో అవి ఒక్కసారిగా పేలాయి. దాంతో బైక్ నడుపుతున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
VIDEO
బైక్పై తీసుకెళ్తుండగా పేలిన ఉల్లిగడ్డ బాంబులు.. ఓ మహిళ మృతి
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతుండగా.. బైక్ గోతిలో పడి బాంబులు పేలాయి.
ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. మరి కొందరికి గాయాలయ్యాయి. pic.twitter.com/tZBMIrtNzb
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2024









