నిరుద్యోగ నిరసన మార్చ్ కి ప్రియాంక గాంధీ
నిరుద్యోగ నిరసన మార్చ్ కి ప్రియాంక గాంధీ
నల్లగొండ, మన సాక్షి:
కాంగ్రెస్ పార్టీ నేతలంతా విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాదులోని సరూర్నగర్ లో జరిగే నిరుద్యోగుల నిరసన మార్చ్ కు ఏఐసీసీ కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారని,ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.
నల్గొండలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ విజయవంతం చేసిన విధంగానే హైదరాబాదులో ప్రియాంక గాంధీ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. పార్టీ శ్రేణులంతా విభేదాలను పక్కనపెట్టి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, కార్యదర్శి పూన్న కైలాస నేత,నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండేటి మల్లయ్య, తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









