Breaking Newsతెలంగాణహైదరాబాద్
Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి తప్పిన ప్రమాదం..!

Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి తప్పిన ప్రమాదం..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానానికి పక్షి తగిలింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన పైలట్.. ఎంతో చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు.
దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. పైలట్ సమయ స్ఫూర్తితో వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.
MOST READ :
- Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..!
- District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!
- Singareni : 1258 మంది సింగరేణి బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ..!
- District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలి..!









