Special Trains : స్పెషల్ ట్రైన్స్ .. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా..!

Special Trains : స్పెషల్ ట్రైన్స్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

వారాంతపు ప్రత్యేక స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ – నాగర్ కోయిల్, నాగర్ కోయిల్ – కాచిగూడ నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్ లు నల్గొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్లనున్నాయి.

 

కాచిగూడ – నాగర్ కోయిల్ (07436)
ప్రత్యేక చార్జి రైలు. ఈ నెల 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీలలో 7:45 గంటలకు కాచిగూడ లో బయలుదేరి మరుసటి రోజు 10 :30 గంటలకు నాగర్ కోయిల్ చేరుకుంటుంది.

 

అదేవిధంగా (నెం. 07436) నాగర్ కోయిల్ – కాచిగూడ ప్రత్యేక చార్జి రైలు . ఈనెల 28 జూన్ 4, 11, 18, 25, జూలై 2వ తేదీలలో అర్థరాత్రి 12:30 గంటలకు నాగర్ కోయిల్ లో బయలుదేరి రెండవ రోజు ఉదయం 6:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

 

ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి ,గుంటూరు, తెనాలి, బాపట్ల , ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు, కంటోన్మెంట్, తిరువన్నామలై, విల్లుపురం, విరుదాచలం, శ్రీరంగం, తిరుచ్చి, దిండుగల్, మదురై , విరుదునగర్ కోవిల్ పట్టి , తిరునల్వేలి స్టేషన్లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది.