Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

నల్లగొండ, మన సాక్షి :

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారిపై పలుచోట్ల వర్షం నీరు నిలిచి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేట వద్ద హైదరాబాద్ , విజయవాడ రహదారి బ్లాక్ అయింది.

అంతో అధికారులు ముందస్తుగా ట్రాఫిక్ మల్లించారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద ట్రాఫిక్ మళ్ళించారు. అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై నుంచి మిర్యాలగూడ మీదుగా గుంటూరు, విజయవాడకు ట్రాఫిక్ ను మళ్ళించారు.

అద్దంకి , నార్కట్ పల్లి రహదారి మీదుగా ట్రాఫిక్ ను మళ్ళించడం వల్ల వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దాంతో రహదారి వెంట ఉన్న గ్రామస్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పేర్కొంటున్నారు.

LATEST UPDATE : 

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

NDA : ఒకరోజు ముందే సెప్టెంబర్ పింఛన్ల పంపిణీ.. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పుష్పాభిషేకం..!

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు