Shaligowraram : పూర్వ విద్యార్థుల 20 ఏళ్ల ఆత్మీయ కలయిక..!
Shaligowraram : పూర్వ విద్యార్థుల 20 ఏళ్ల ఆత్మీయ కలయిక..!
శాలిగౌరారం, మన సాక్షి :
ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు రెండు దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు.శాలిగౌరారం మండలం మాధవరం (కాలన్) జడ్పీ హెచ్ ఎస్ హైస్కూల్ లో చదువుకున్న 2005 -2006 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆదివారం శమాధారం కాలన్ గ్రామంలోని పాఠశాలలో కలుసుకున్నారు.
తాము చదువుకున్న పాఠశాలలో ఒకే వేదికపై కలుసుకోవాలన్న ఆలోచనలతో గత 15 రోజుల నుంచే పూర్వ విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకుని సమ్మేళనం ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్య బోధించిన ఆనాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికి ఒకరు ఎవరు వేసుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారు తోటి స్నేహితులకు మంచి చెడు అన్నిట్లో ముందంజలో ఉండేలా స్నేహభావాన్ని చాటాలని నిర్ణయించుకున్నారు.
MOST READ :
-
Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!
-
Free WorkShop : ఉచిత బ్యూటీషియన్ ట్రైనింగ్ వర్క్షాప్..!
-
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!









