Breaking NewsTOP STORIESజాతరలుమెదక్
రామలింగేశ్వరుని దర్శించుకున్న కేంద్ర మంత్రి
రామలింగేశ్వరుని దర్శించుకున్న కేంద్ర మంత్రి
దుబ్బాక, మనసాక్షి :
దక్షిణ కాశీగా పేరు గాంచిన కూడవేల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కేంద్ర మత్స్య శాఖ మంత్రివర్యులు పరిశోత్తం రూపాల దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…
రామలింగేశ్వర ఆలయం ఎంతో గొప్పదని, ఆలయాన్ని దర్శనం చేసుకుంటున్న భక్తులతో తెలిసిపోయిందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి కృషి చేస్తామని అన్నారు. ఆలయాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఆ రామలింగేశ్వరూడి దయ ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బిజెపి నాయకులు దూది శ్రీకాంత్ రెడ్డి, సంతోష్ గుప్తా, బాలేష్ గౌడ్, సుంకు ప్రవీణ్, దూలం వెంకటేష్, సుధా రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.









