Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
మునగాల : ఘోర రోడ్డు ప్రమాదం , ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ
మునగాల : ఘోర రోడ్డు ప్రమాదం ,
ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ
ఇద్దరు మృతి మరో ఇద్దరికి గాయాలు
మునగాల, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కార్మికుల ట్రాక్టర్లు లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల ప్రకారం…
జాతీయ రహదారిపై కార్మికులు భారికేడ్లు అడ్డుపెట్టుకొని మొక్కలు కట్ చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ట్రాక్టర్ ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యా యి.
గాయాలైన వారిని కోదాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నడిగూడెం మండలం రామాపురం కు చెందిన ధనమ్మ, వినోదలుగా గుర్తించారు.









