Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
బస్సులో పోగొట్టుకున్న ల్యాప్ టాప్ ను అందజేసిన కండక్టర్..!
బస్సులో పోగొట్టుకున్న ల్యాప్ టాప్ ను అందజేసిన కండక్టర్..!
కంగ్టి, మన సాక్షి :-
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుండి జహీరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో సురేఖ అనే ఉపాధ్యాయురాలు శనివారం తన ల్యాప్ టాప్ ను మరిచిపోయింది.
కాస్సేపటి తర్వాత గమనించిన కండక్టర్ జనాభాయి ఆ ల్యాప్ టాపును డిపో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఆఫీస్ సూపరింటెండెంట్ చందుపళ్ళ సమక్షంలో తిరిగి ప్రయాణికురాలికి అందజేశారు. కండక్టర్ ను రీజినల్ మేనేజర్ ప్రభులత, డిప్యూటీ ఆర్ఎం దైవాదినం, మేనేజర్ మల్లేషయ్యలు కండక్టర్ ను అభినందించారు.
ALSO READ : Election : ఎల్లారెడ్డి బాద్ షా అతనే..!









