Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : భారీగా నగదు పట్టివేత..!
Miryalaguda : భారీగా నగదు పట్టివేత..!
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దులో మంగళవారం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద 9.50 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని చెక్ చేయగా నగదు నాభ్యమైంది. నగదును ఎన్నికల నియమావళి లో భాగంగా సీజ్ చేశారు.
అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ వద్ద వాహనాల చెకింగ్ లో భాగంగా టూ టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంగుల రాంబాబు నుంచి 84 వేల 290 రూపాయలను సీజ్ చేశారు.
ALSO READ : BREAKING : రైతు భరోసా పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









