Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంమహబూబాబాద్ జిల్లా

కురవి లో చోరి కలకలం..!

కురవి లో చోరి కలకలం..!

ఏడు తులాల బంగారం, వెండి నగలు అపహరణ.

• 15 వేల రూపాయల నగదు తోపాటు కీలక డాక్యుమెంట్లు స్టోరీ.

కురవి, మన సాక్షి:

కురవి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోరీ కలకలం రేపింది. బాధితుడు మేక దామోదర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మేరకు ఈ విధంగా ఉన్నాయి. ఆగస్టు 11న హైదరాబాద్ పట్టడానికి కుటుంబ సమేతంగా వెళ్ళగా అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు పడ్డారు.

ఏడు తులాల మేర బంగారు ఆభరణాలతో పాటు వెండి గొలుసులు 15 వేల రూపాయల నగదు తో పాటు పలు విలువైన దస్త్రాలు దొంగలిచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు స్పందించిన ఎస్సై గోపి హుటాహుటిన క్లూస్ టీం లను రప్పించి ఆధారాలు సేకరించారు.

అయితే ఈ ఘటనకు పాత నేరస్తులే పాల్పడి ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో కురవి మండల కేంద్రంలో దొంగల బీభత్సం పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ALSO READ : 

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ గేట్లు బంద్..!

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

మరిన్ని వార్తలు