తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Komatireddy : శ్రీశైలం సొరంగం పూర్తి చేయడమే నా లక్ష్యం.. మంత్రి కోమటిరెడ్డి..!

Komatireddy : శ్రీశైలం సొరంగం పూర్తి చేయడమే నా లక్ష్యం.. మంత్రి కోమటిరెడ్డి..!

కనగల్, మన సాక్షి:

శ్రీశైలం(ఎస్ ఎల్ బి సి) సోరంగాన్ని పూర్తి చేయడం తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం చిన్నమాదారం గ్రామంలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్డు, డ్రైన్ లు నిర్మిస్తామని, రూ.100 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. చిన్నమాదారం మీదుగా కనగల్ వరకు రూ.15 కోట్లతో డబుల్ రోడ్డుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని, ప్రధాన రహదారి కలిసే వరకు మరో రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ చేపడతామన్నారు.

చిన్నమాదారంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రైతుల సాగుకు అవసరమైన నాణ్యమైన కరెంటు అందుతుందని, తద్వారా ఆ ప్రాంతంలో లో వోల్టేజీ సమస్య తీరుతుంది అన్నారు. నల్గొండ జిల్లాలోని సాగుభూములన్నిటికి సాగునీరు అందించేందుకుగాను ఎస్ ఎల్ బి సి సొరంగం పూర్తి చేయడమే తన ధ్యేయమని, ఇందుకుగాను గతంలో ప్రభుత్వాలతో కొట్లాడి ఎస్ ఎల్ బి సి సొరంగాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

అనివార్య కారణాలవల్ల ఆగిపోయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ. 2200 కోట్లు మంజూరు చేసిందని, సొరంగం తవ్వే మిషన్ మరమ్మతు కారణంగా ఆగిపోగా, అమెరికా నుండి విడిభాగాలు తెప్పించి పనులను పునరుద్ధరిస్తున్నామన్నారు.

రెండేళ్లలో రాబోయే రెండేళ్లలో శ్రీశైలం సొరంగం పనులు పూర్తిచేసి గ్రావిటీ ద్వారా రైతులకు మూడు పంటలకు సాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యం అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ ద్వారా చెరువులను నింపుతున్నామని, రైతులు బాగుంటేనే అందరు బాగుంటారని, సాగర్ ఆయకట్టు చివరి వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

జిల్లాలో పూర్తిగా ఫ్లోరైడ్ తుడిచిపెట్టుకోవాలని, స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరికి అందాలని అన్నారు. ఇల్లు లేని వారందరికీ గ్రామానికి 50 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నామని, రుణమాఫీలో భాగంగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు.

అంతకుముందు మంత్రి గ్రామంలోని జిల్లా పరిషత్తు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నమాధారం ఉన్నత పాఠశాలలో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో భవనానికి కలర్ వేయించడంతోపాటు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, బాత్రూం అన్నింటిని మరమ్మతుచేయిస్తామని, అలాగే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, నల్లాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన ఆర్థిక సాయం ఇస్తామని తెలపడమే కాకుండా తక్షణమే ఈ పనులు చేపట్టేందుకు మంత్రి రూ. 50 వేల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందించారు. వీటితోపాటు, క్రీడా సామాగ్రిని మంజూరు చేస్తామని, డైనింగ్ హాల్ లో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

విద్యార్థులు కష్టపడి చదివి పదికి పది జీపీఏ తీసుకురావాలని ,పాఠశాల గ్రౌండ్ ను చదును చేస్తామని చెప్పారు. తోరగల్ నుండి చిన్నమాదారం వరకు రూ.10 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణాన్ని మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలలో నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్ ఈ బాలరాజు, డి ఈ వెంకటేష్, మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ రవి,
మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మందడి రామచంద్రారెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవిరెడ్డి వెంకట్ రెడ్డి, దేప నరేందర్ రెడ్డి, రాజు పాఠశాల హెచ్ఎం పద్మ, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజావాణికి అనూహ్య స్పందన.. సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశాలు..!

GURUKULA : గురుకుల పాఠశాలలో దారుణం, విద్యార్థులపై ఎలుకల దాడి.. విద్యార్థి సంఘాల ఆగ్రహం.! 

Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!

మరిన్ని వార్తలు