Miryalaguda : అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు..!
Miryalaguda : అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగ రంగ వైభవంగా “శ్రీ గోదాదేవి ( ఆండాళ్) ధనుర్మాస ఉత్సవాలు” సోమవారం ప్రారంభమయ్యాయి.
ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయం 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని రజితోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ ప్రారంభ ఉత్సవాల్లో అర్చకులు కారంపూడి రాఘవాచార్యులు కమలకుమార్ , సింహాద్రి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు చెన్నూరు వేణుగోపాలరావు, గోదాటి నాగలక్ష్మి , ప్రధాన కార్యదర్శి కన్నెగుండ్ల రంగయ్య, సహాయ కార్యదర్శి పి. శ్రీనివాస్, తీగల రమాదేవి , కార్యనిర్వహణ కార్యదర్శి కాసుల సత్యమ్, కోశాధికారి శ్రీనవాసు, కమిటి సభ్యులు గార్లపాటి శ్రీరామ్ రెడ్డి, చిల్లంచర్ల వెంకటేశ్వర్లు, కాకునూరి రోశమ్మ, సువర్ణ లక్ష్మి, మన్నెం విజయలక్ష్మి, పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
-
Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!
-
TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!









