Penpahad : యూరియా సరఫరాకు చర్యలు.. మనసాక్షి కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారి..!
Penpahad : యూరియా సరఫరాకు చర్యలు.. మనసాక్షి కథనానికి స్పందించిన వ్యవసాయ అధికారి..!
పెన్ పహాడ్ , మన సాక్షి;
సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతా రం పిఎసిఎస్ లో యూరియా కొరత అనే శీర్షిక సోమవారం మన సాక్షిలో ప్రచురితమైనవార్తకు స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి బుధవారం ఆయన పిఎసిఎస్ అనం తారం లో ఆకస్మికంగా స్టాకు రిజిస్టర్లు రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్న విధానాన్ని ఎరువుల స్టాక్ ఎరువుల నిలువలను పరిశీలించి రైతులతో వివరణ తీసుకున్నారు.
ఇప్పటి నుండి రైతులకు ఎరువులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని ఆయన రైతులకు తెలిపినారు. రైతులు అధికంగా యూరియా వాడకుండా పిచికారి పురుగుమందులను మోతాదు నీటిలో కలుపుకొని పిచికారి చేయవచ్చు.. ఈ విధంగా చేయడం వలన ఓరిని పురుగుల తినకుండా అదుపు చేయవచ్చని ఆయన రైతులకు తెలిపినారు.
వరి పొలాలను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు అందించినారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్, విస్తరణ అధికారి శ్రావణి, సంఘ సభ్యులు సతీష్, లక్ష్మారెడ్డి రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!
-
Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!
-
Gold Price : బంగారం టాప్ గేర్.. ఒక్కరోజే రూ.9200.. లేటెస్ట్ అప్డేట్..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
గ్రామ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు.. రికార్డులను పరిశీలించిన డిఎల్పివో..!










