క్రైంBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్
సాంబార్ లో పడిన బాలుడు మృతి..!
సాంబార్ లో పడిన బాలుడు మృతి..!
నిజామాబాద్ జిల్లా (భీంగల్) మన సాక్షి :
ఓ శుభకార్యంలో భోజనాల కోసం వండి ఉంచిన వేడి సాంబార్ లో పడిన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. భీంగల్ పట్టణానికి చెందిన కర్నె నిహారిక తన మూడేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఈ నెల 19న ముచ్కూర్ లో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరైంది.
అక్కడ పిల్లలతో చార్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబార్ బగొనీలో పడ్డాడు. బగోనీలోని వేడి సాంబార్ కారణంగా బాలుడి శరీరం మీద చర్మం ఊడి రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చార్విక్ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
MOST READ :









