Miryalaguda : మున్సిపాలిటీ వారి సువర్ణ అవకాశం.. 25 శాతం రాయితీ..!
Miryalaguda : మున్సిపాలిటీ వారి సువర్ణ అవకాశం.. 25 శాతం రాయితీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం LRS చెల్లించేందుకు గడువు విధించింది. అందుకు రాయితీ కూడా అందిస్తుంది. దీనిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు ప్లాట్ల యజమానులకు ఇది సువర్ణ అవకాశం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
దీనిని ప్లాట్ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ పేర్కొన్నారు. 25 % రాయితీ ఉంటుందని మార్చి 31వ తేదీ వరకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31, 2025 లోగా పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీ పొందాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాయితీ పొందడంతో పాటు ప్లాట్ ను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. అందుకుగాను హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా వివరాలు కావాలంటే హెల్ప్ డెస్క్ నెంబర్లు 9966550549, 9885004218 సంప్రదించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
Fake Doctor : నకిలీ వైద్యుడి గుట్టు రట్టు.. క్లినిక్ సీజ్..!
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!










