తెలంగాణBreaking Newsమహబూబాబాద్ జిల్లా
RDO Office : న్యాయం కోసం ఆర్డివో కార్యాలయం వద్ద వృద్ధురాలు ఆవేదన..!
RDO Office : న్యాయం కోసం ఆర్డివో కార్యాలయం వద్ద వృద్ధురాలు ఆవేదన..!
తొర్రూరు, ( మన సాక్షి) :
తన కుమారుడు భూమిని అక్రమంగా పట్టా చేసుకుని, యోగక్షేమాలు చూసుకోవడం లేదని వృద్ధురాలు యెల్ది సుశీల సోమవారం తొర్రూరు డివిజన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
మరిపెడ మండలం రాంపురానికి చెందిన యొల్ది సుశీల, భర్త మృతికి ముందు పంచిన 18 ఎకరాల భూమిలో తన వాటా మినహాయించి, ప్రభుత్వ ఉద్యోగి అయిన చిన్న కుమారుడు రమేష్ మరో 2.5 ఎకరాలను అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపించారు.
ప్రశ్నించిన తల్లిని బెదిరించినట్టు తెలిపారు. తాజాగా రమేష్ ఆక్రమించిన భూమిని విక్రయించగా, వృద్ధురాలు కలెక్టర్, సిసిఎల్ఎలను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ భూమి తన పేరుపై చేర్చాలని, తన యోగక్షేమాలను పరిరక్షించాలని సుశీల డిమాండ్ చేశారు.
MOST READ :









