Breaking Newsక్రైంనల్గొండ
Nalgonda : పేకాట రాయళ్లపై కేసు నమోదు..!
Nalgonda : పేకాట రాయళ్లపై కేసు నమోదు..!
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులో శనివారం సాయంత్రం కొందరు యువకులు పేకాట ఆడుతున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ముత్యాల రామ్మూర్తి తన సిబ్బందితో గ్రామానికి చేరుకొని పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు సెల్ ఫోన్లో, మోటార్ బైక్, దీంతో పాటు10,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :









