Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!

Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!
కోటగిరి, మన సాక్షి :
అవసరం లేని మందులతో రైతులపై అధిక భారం మోపుతున్నారని పోతంగల్ మండలం హెగ్డేలి గ్రామానికి చెందిన రైతులు బుధవారం అగ్రికల్చర్ ఆఫీసర్ నిషిత కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. ఎరువులు కావాలని హెగ్డేలి విశాల సహకార సంఘం పరపతి సంఘం కు వెళితే అవసరం ఉన్న మందులు కావాలంటే డిఏపి 10 సంచుల తీసుకుంటే అదనంగా మూడు లిక్విడ్ బాటిల్ తీసుకుంటేనే ఎరువులు ఇస్తామని రైతులకు అదనంగా భారం మోపుతు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేని ఎరువులు తీసుకుపోయి ఏం చేసుకోవాలని రైతులు అంటున్నారు.
ఉమ్మడి మండలాల్లో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు పెట్టడం లేదని హెగ్డేలి సహకార సంఘంలోనే రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రావణ్ కుమార్, సుధీర్, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Narayanpet : జిల్లా ఎస్పీ కీలక సూచన.. యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్ గా పనిచేయాలి..!
-
ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!
-
Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!









