TOP STORIESBreaking Newsహైదరాబాద్

TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8-9 తేదీలలో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకులు, పరిశ్రమ నిపుణులు మరియు విధాన నిర్ణేతలు సమావేశమై తెలంగాణ భవిష్యత్తు గురించి చర్చించనున్నారు.

ముఖ్య ముఖ్యాంశాలు:

– థీమ్: 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే రాష్ట్ర దార్శనికతపై దృష్టి సారించే తెలంగాణ రైజింగ్ 2047
– వక్తలు: WHO, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు UNICEF ప్రతినిధులతో సహా ప్రపంచ నాయకులు, పరిశ్రమ నిపుణులు మరియు విధాన నిర్ణేతలు
– సెషన్లు: శక్తి, గ్రీన్ మొబిలిటీ, IT, సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యాటకం మరియు మరిన్నింటిపై 27 ప్యానెల్ చర్చలు

ప్రత్యేక సెషన్లు:

– పి.వి. వంటి క్రీడా దిగ్గజాలతో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. సింధు మరియు అనిల్ కుంబ్లే
– క్రియేటివ్ సెంచరీ – ఎస్.ఎస్. రాజమౌళి మరియు రితేష్ దేశ్‌ముఖ్ వంటి చిత్ర పరిశ్రమ దిగ్గజాలతో సాఫ్ట్ పవర్ & ఎంటర్‌టైన్‌మెంట్

ఆవిష్కరణ:

భవిష్యత్ వృద్ధి మరియు అభివృద్ధి కోసం రాష్ట్ర రోడ్‌మ్యాప్‌ను వివరించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్

ఈ సమ్మిట్ తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం మరియు ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 1,000 మందికి పైగా ప్రతినిధులు మరియు 500 కంపెనీలు హాజరవుతున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్-ఛేంజర్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి :

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యుత్తమ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) కు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సదస్సు నిర్వహిస్తున్న మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future City) ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు.

తర్వాత వేదిక ప్రాంగణమంతా కలియతిరిగి ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రతి అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా వహించాలని చెప్పారు.

సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) దార్శనికత ఉట్టిపడే విధంగా ఆయా అంశాలపై ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను వీక్షించారు.

అంత‌ర్జాతీయ కంపెనీల‌కు చెందిన ప్ర‌తినిధులు, కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు స‌మ్మిట్‌కు హాజ‌ర‌వుతున్నందున వారికి స్వాగ‌త ఏర్పాట్లు, వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాల విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు.

ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోజన వసతి వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రాంగణంలో భద్రతా పరమైన ఏర్పాట్లతో పాటు ఫైర్ సేఫ్టీ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. ఈ పరిశీలనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.

MOST READ :

  1. Fire Accieent : గోవాలో భారీ ప్రమాదం.. 23 మంది మృతి..!

  2. Sarpanch Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. తొలివిడతలో ఏకగ్రీవాలు అన్ని వందలా..!

  3. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. దేవరకొండకు అండగా ఉంటా..!

  4. సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట.. బీఆర్ఎస్ నేతల హస్తంపై సర్వత్రా చర్చ..!

మరిన్ని వార్తలు