TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
మెస్సీతో ఈ మేస్త్రీ ఫుట్ బాల్ ఆడటానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు విమర్శించారు. 100 కోట్ల రూపాయలతో ఫుట్ బాల్ ఆడే కంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి కడుపునిండా మంచి ఆహారం పెట్టొచ్చని అన్నారు.
బాగ్ లింగంపల్లి గురుకుల పాఠశాలలో 90 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంతా ఫుట్ బాల్ ఆడటంలో బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు.
మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు
బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే, ముఖ్యమంత్రికి, మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదు
ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదు.. అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా… pic.twitter.com/ebkKB9gN20
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2025









