Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలకపాత్ర.. నల్ల సుమిత రఘుమారెడ్డి..!

ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలకపాత్ర.. నల్ల సుమిత రఘుమారెడ్డి..!

చింతపల్లి, మన సాక్షి :

నేటి సమాజంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సుమిత రఘురామారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో వారి నివాసంలో 2026 మన సాక్షి నూతన క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెలికి తీసేటివి పత్రిక లేనని వారు పేర్కొన్నారు.

అనతి కాలంలోనే మన సాక్షి దినపత్రిక రెండు తెలుగు రాష్ట్రాలలో, యూట్యూబ్ వెబ్సైట్ తో పాటు, స్పాట్ న్యూస్ ఐటమ్ లు అందించడంతో అన్ని పత్రికల కంటే మన సాక్షి దినపత్రిక ముందుంటుందనివారు పేర్కొన్నారు. వార్తల సేకరణతో పాటు, రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయి వార్తలను విలేకరులు ఎప్పటికప్పుడు సేకరిస్తూ మన సాక్షి దినపత్రికను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.

మరింత చురుకు అయిన పదునుతో వార్తలు సేకరించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు తోడ్పాటు అందించాలనిపేర్కొన్నారు. పత్రికలు చురుకుగా పని చేస్తేనే అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారన్నారు. అప్పుడే ప్రజా సమస్యలనేటివి ఉండమన్నారు. మన సాక్షి పత్రిక అందరి మన్నలను పొందుతూ ముందుకు వెళ్లడం హర్షించదగ్గ విషయం అన్నారు.

ఈ పత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ నల్ల సుమిత రఘు మా రెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, చింతపల్లి మాజీ పీఎస్ఎస్ నల్ల సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్కాటేపాక చంద్రయ్య,కురుమేటి రాములు,యాదయ్య,యాదవ్, గుణముని కొండల్ యాదవ్, వేణు, సమ్మిడి రవిశంకర్ రెడ్డి, చింతపల్లి మన సాక్షి రిపోర్టర్ పుప్పాల వెంకటేశ్వర్లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు