Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే బోణీ.. కాంగ్రెస్ జోష్..!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలలో 14 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ఏకగ్రీవం కాక రెండు కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది.

Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడే బోణీ.. కాంగ్రెస్ జోష్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోష్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలలో 14 మంది కౌన్సిలర్లు
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాటిలో 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ఏకగ్రీవం కాక రెండు కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో అత్యధిక ఏకగ్రీవ విజయాలు నమోదయ్యాయి.
వివరాల ప్రకారం..
కోదాడ లో మూడు వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు కాంగ్రెస్, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ చెరో ఒక ఏకగ్రీవ విజయాన్ని సాధించాయి. అదేవిధంగా, మహబూబ్నగర్, మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది.
వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 17వ వార్డు (ఎస్సీ మహిళ)లో చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్… కార్పొరేషన్ వార్డు-1(యూఆర్ మహిళ)లో మడిపెల్లి విజయ (కాంగ్రెస్) విజయం సాధించారు.
ఖమ్మం జిల్లా, ఏదులాపురం మున్సిపాలిటీలోని 15వ వార్డు (యుఆర్ మహిళ)లో తమ్మినేని మంగతాయ్ (కాంగ్రెస్) గెలుపొందారు.
నల్గొండ జిల్లా, హాలియా మున్సిపాలిటీలోని 10వ వార్డు (బీసీ మహిళ)లో చంద్రకళ పిల్లి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా గెలుపొందారు.
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డు (బీసీ మహిళ)లో సులవ నాగాలక్ష్మి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా గెలుపొందారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ మున్సిపాలిటీలోని 11వ వార్డు (యుఆర్ మహిళ)లో దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ మున్సిపాలిటీలోని 21వ వార్డు (బీసీ మహిళ)లో కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్) గెలుపొందారు.
సూర్యాపేట జిల్లా, కోదాడ మున్సిపాలిటీలోని 31వ వార్డు (యుఆర్ మహిళ)లో ఎర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా గెలుపొందారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్డు-10 (బీసీ మహిళలు)లో గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 58వ వార్డు (యుఆర్ మహిళ)లో బి. రమాదేవి (కాంగ్రెస్) ఎన్నికయ్యారు.
మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీలోని వార్డు-32 (యుఆర్ ఉమెన్)లో గోదాల మానస (కాంగ్రెస్) గెలుపొందారు.
జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు (ఎస్టీ జనరల్)లో పి. విక్రమ్ (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా గెలుపొందారు.
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు-1 (యూఆర్ జనరల్)లో అనంత్ రెడ్డి పటోళ్ల (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ వార్డు-15 (ఎస్సీ జనరల్)లో పి.విజయలక్ష్మి (బీఆర్ఎస్) విజయం సాధించారు.









