Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
BIG BREAKING : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, డ్రమ్ములో కుక్కి.. చివరికి ఆ కిరాతకుడు..!
ఆంధ్ర ప్రదేశ్ లో ని మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి నీటి డ్రమ్ములో కుక్కి హత్య చేసిన కిరాతకుడు కులవర్ధన్ మృతి చెందాడు. అతడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

BIG BREAKING : ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, డ్రమ్ములో కుక్కి.. చివరికి ఆ కిరాతకుడు..!
మన సాక్షి, మదనపల్లి :
ఆంధ్ర ప్రదేశ్ లో ని మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి నీటి డ్రమ్ములో కుక్కి హత్య చేసిన కిరాతకుడు కులవర్ధన్ మృతి చెందాడు. అతడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. చిన్నారిని అత్యాచారం చేసి నీటి డ్రమ్ములో నుంచి అతికిరాతకంగా హత్య చేసినట్లుగా కులవర్ధన్ ను అనుమానించారు.
కాగా మంగళవారం మదనపల్లి మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. కాగా కులవర్ధన్ మదనపల్లిలోని కనసాని వారి పల్లె చెరువులో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎవరికీ అప్పగిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.









