Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
రెండు తెలుగు రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. గత కొద్ది రోజులుగా వర్షం లేక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల వాతావరణ ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న కొన్ని గంటల్లో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలిక పాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.









