Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం
ఎం.పి. మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ జిల్లా బీసీ నాయకులు..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు గ్రామపంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) జిల్లా బీసీ నాయకులు తిమ్మయ్య ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి లోని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎం.పి. మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ జిల్లా బీసీ నాయకులు..!
రామసముద్రం ఆగస్టు 24 మనసాక్షి
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు గ్రామపంచాయతీ నరసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) జిల్లా బీసీ నాయకులు తిమ్మయ్య ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతి లోని ఆయన స్వగృహంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా, మండలం లో బీసీ వర్గాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం, బీసీ నాయకుల సమస్యలు తదితర విషయాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.









