సూర్యాపేట : 12 గంటలపాటు అఖండ భజన
సూర్యాపేట : 12 గంటలపాటు అఖండ భజన
శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా దేవాలయం లో కార్యక్రమం
సూర్యాపేట , మనసాక్షి
సూర్యాపేట పట్టణంలోని శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో దేవాలయ కమిటి, అఖిలభారత అయ్యప్ప ధీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా నీ గానమే నా ప్రాణం 12 గంటల పాటు జిల్లాలోని వివిధ భజన మండలులు, భక్తుల ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహా పడిపూజ ను నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
.ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు నరేంద్రని విద్యాసాగర్ రావు ప్రధాన కార్యదర్శి పయిడిమర్రి కేశవులు, గొట్టిముక్కల శ్రీనివాస రెడ్డి దేశ్ ముఖ్ పాండే, జెపిడి గురుస్వామి, మిర్యాల సంపత్, సంకురుశెట్టి పరమేష్, కడారి వెంకన్న, మర్రి రాజశేఖర్, అంతటి విజయ్, శంకర్ లాల్, ఓరుగంటి వెంకటేశ్వర్లు, అర్వపల్లి సత్యనారాయణ,జగిని ప్రసాద్, రాం ప్రసాద్, వెంకట రెడ్డి గురుస్వామి,
యర్రంశెట్టి ఉపేందర్, పయిడిమర్రి రమేష్, మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వరరావు, వేమిశెట్టి మధు, అర్చకులు రెంటాల సతీష్, కోటేశ్వరరావు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ జిల్లా నాయకులు వంకాయలపాటి శంకర్ , రంగు ముత్యంరాజు ,సుంకాని శ్రీనివాస్ ,మాలి లింగారెడ్డి ,రాఘవశేట్టి తో పాటు పలువురు,భక్తులు పాల్గొన్నారు.









