మిర్యాలగూడ : బిజెపి పై సీపీఎం రాఘవులు సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడ : బిజెపి పై సీపీఎం రాఘవులు సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడ  , మన సాక్షి :

2024 లో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడనున్నదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు బద్ధ శత్రువులైనప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఏకతాటి పైకి రావాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు.

 

మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహకాలు జరుగుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికల క్యాంపియన్లు చేస్తున్నారని తెలిపారు 2024లో బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అన్నారు.

 

Also Read : RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

 

బిజెపి విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి రావలసిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఈనెల 23వ తేదీన బీహార్ లో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని తెలిపారు . ఈ సమావేశానికి సిపిఎం హాజరవుతుందని తెలిపారు.

 

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి కేసీఆర్ కూడా హాజరుకావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హాజరవుతున్నదనా..? లేదా వేరే కారణమేమో తెలియదు కానీ కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసిందని చెప్పారు.

 

హాజరు కావడం హాజరు కాకపోవడం వారి ఇష్టమని , బిజెపి ఓడించడమే లక్ష్యంగా ఉంటే హాజరుపై ఆలోచించాలని కోరారు. సిపి ఎం కు కూడా కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థంగా ఉందని అయినప్పటికీ బీజేపీని ఓడించాలని లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు.

త్వరలో జరిగే పార్లమెంటు సమావేశంలో మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టాలను తీసుకురాబోతుందని చెప్పారు. ఢిల్లీలో తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్ అన్ని పార్టీలు ఖండించాలని, ఫెడరల్ వ్యవస్థను బలపరచాలని లక్ష్యం ఉన్న వారందరూ ఆ ఆర్డినెన్స్ వ్యతిరేకించాలని కోరారు .

 

యూనిఫామ్ సివిల్ కోడ్ ను బలవంతంగా దేశంపై రుద్దెందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీనివల్ల ప్రజల మధ్య విభజన సృష్టించి మత విద్వేషాలతో రాజకీయాలు చేయాలని చూస్తుందని ఆరోపించారు.

 

దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేయాలని అప్పుడే మరోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు.

 

ధాన్యం అమ్ముకున్న రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పొడు భూములకు పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

Also Read : Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!

 

ఇంటి జాగా ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తక్షణమే పంపిణీ చేయాలని, పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. పేదలకు గుడిసెలు వేసుకుంటే పీకేయడం, కేసులు పెట్టడం సరింది కాదని ఆ చర్యలను మానుకోవాలని కోరారు.

 

చిత్తశుద్ధితో హామీలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తీగల సాగర్ సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.