Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

సిపిఎం కు రాజీనామా చేసి బి ఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్

సిపిఎం కు రాజీనామా చేసి బి ఎల్ ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్

వేములపల్లి , మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్, ప్రస్తుత 9వ వార్డు నెంబర్ జేరిపోతుల ఎల్లమ్మ ఆ పార్టీకి రాజీనామా చేసి సామాజికవేత్త , కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి బిఎల్ఆర్ స్వాగతం పలికారు .

ఈ సందర్భంగా జేరిపోతుల ఎల్లమ్మ మాట్లాడుతూ పేదల కోసం పోరాడవలసిన సిపిఎం పార్టీ పెత్తందారి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ తో కలిసి పోవడానికి జీర్ణించుకోలేక, పేదలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే* సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొల్కపట్నం బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వార్డు మెంబర్ పేరెల్లి నాగేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, ఉప సర్పంచ్ రామదార కరుణాకర్, వార్డ్ మెంబర్ రాచూరి వెంకన్న సీనియర్ నాయకులు భారీ పాండు కొమ్మనబోయిన ఆంజనేయులు, శ్రీకాంత్ , పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు