క్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District SP : జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరిక.. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్..!

నల్లగొండ జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.

District SP : జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరిక.. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కౌన్సిలింగ్..!

నల్లగొండ, మన సాక్షి.

నల్లగొండ జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి హాజరు పరచి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో నేరాలనుమానుకొని, సమాజంలో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని వారికి సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

తరచూ నేరాలకు పాల్పడుతున్న నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పిడి , రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్టులు రిమాండ్ వంటి చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కఠినంగా హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

అలాగే, దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామనితెలిపారు.
ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం ఉంచాలని సూచించారు.

ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు.జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారు సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని ఉపాధి మార్గాల వైపు అడుగులు వేయాలని, అలాంటి వారికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ–సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక వారి కష్టాలు తీరినట్టే..!

  2. Nalgonda : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి కృషి.. INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి..!

  3. Nalgonda : రేపటి నుంచి నో హెల్మెట్ – నో పెట్రోల్ నిబంధన అమలు..!

  4. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

మరిన్ని వార్తలు