Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!
Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!
మన సాక్షి, హైదరాబాద్ :
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం లో శనివారం తెల్లవారుజామున ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెల్లడంతో ఐదుగురు యువకులు జల సమాధి అయ్యారు.
వివరాల ప్రకారం.. హైదరాబాదులోని హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన యువకులు ఎల్బీనగర్ నుంచి పోచంపల్లి వెళ్తుండగా తెల్లవారుజామున మంచు ఉండడంతో కారు అదుపుతప్పి జలాల్పూర్ మూలమలుపు వద్ద చెరువులోకి దూసుకెళ్లింది.
ఈ సంఘటనలో ఐదుగురు యువకులు జల సమాధి కాగా ఒకరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. మృతులను వంశీ గౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్ గౌడ్ గా గుర్తించారు. మీరంతా 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారే. మణికంఠ అనే యువకుడు క్షేమంగా బయటపడ్డారు.
శనివారం తెల్లవారు జామున వంశీ కారు డ్రైవింగ్ చేస్తుండగా 4.30 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు మణికంఠ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, రెండు పల్టీలు కొట్టి చెరువులో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :
-
Khammam : వేతనాల కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!
-
TG News : పెన్షన్ల పెంపు అప్పుడే.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!
-
Gold Price : మళ్లీ పెరుగుతున్న గోల్డ్.. మహిళల్లో నిరాశ..!









