Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
lifestyle

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైబ్రిడ్, రిమోట్ వర్క్ విధానం అమలు

భారతదేశంలోని ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థలలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన ఉద్యోగుల కోసం సరికొత్త పని విధానాన్ని ప్రకటించింది

భారతదేశంలోని ప్రముఖ స్టాక్‌బ్రోకింగ్ సంస్థలలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తన ఉద్యోగుల కోసం సరికొత్త పని విధానాన్ని ప్రకటించింది. పనితీరును మెరుగుపరచడం, ఉద్యోగులకు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను పెంపొందించడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా, మరింత సరళమైన, విభిన్నమైన, ఉద్యోగ-కేంద్రిత వాతావరణాన్ని పెంపొందించడానికి కంపెనీ ఈ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది.

ఈ కొత్త నిర్ణయాల ప్రకారం 2026 జూన్ 1వ తేదీ నుంచి ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, రిస్క్, కాంప్లయన్స్, లీగల్ అండ్ సెక్రటేరియల్, రీసెర్చ్, మార్కెటింగ్ వంటి అన్ని కార్పొరేట్ సపోర్ట్ విభాగాలు హైబ్రిడ్ పని విధానాన్ని అవలంబించనున్నాయి. రాబోయే 2 నెలల పాటు ఈ విభాగాల ఉద్యోగులు వారానికి 2 రోజులు రిమోట్ పద్ధతిలో అంటే ఇంటి నుంచే పని చేస్తారు. ఆ తర్వాత బయటి పరిస్థితులు కార్యాచరణ అవసరాల ఆధారంగా ఈ విధానాన్ని సంస్థ సమీక్షిస్తుంది.

ఈ సరికొత్త చొరవపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ నీతికా భాటియా మాట్లాడుతూ, పని భవిష్యత్తును సరికొత్తగా నిర్వచించడంలో తాము ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించడం, ఉద్యోగుల సాధికారత క్లయింట్‌లకు అత్యుత్తమ సేవలను అందించడంలో తమకు ఉన్న నిబద్ధతకు ఈ హైబ్రిడ్ మోడల్ నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ఇంజనీరింగ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్, డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ బృందాలు పూర్తిగా రిమోట్ విధానంలోనే, అంటే ఎక్కడి నుంచైనా పని చేసేలా తమ విధులను కొనసాగిస్తాయని నీతికా భాటియా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న విభిన్నమైన విస్తృతమైన ప్రతిభావంతులను కంపెనీలోకి ఆహ్వానించడానికి వీలవుతుందని, అలాగే ఉద్యోగులకు గరిష్ట సౌలభ్యం లభిస్తుందని ఆమె తెలిపారు.

దీనితో పాటు ఉద్యోగుల సౌకర్యార్థం హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఇప్పటికే మరో కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని బ్రాంచ్‌లకు ప్రతి శనివారం పూర్తి సెలవు దినంగా ప్రకటించింది. గతంలో 1, 3, 5వ శనివారాల్లో బ్రాంచ్‌లు పనిచేసే విధానం ఉండేది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ 24/7 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా ఈ మార్పు వల్ల కస్టమర్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా విజయవంతంగా సాగుతోంది. మొత్తంగా చూస్తే, ఈ సరికొత్త పని విధానాలు ఉద్యోగుల సంక్షేమం, ఆవిష్కరణలు కస్టమర్లకు అద్భుతమైన సేవలను అందించడంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిబద్ధతను తెలియజేస్తున్నాయి.

మరిన్ని వార్తలు