Nalgonda : అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
Nalgonda : అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
నల్లగొండ, మన సాక్షి :
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఉన్న ఖాళీ అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 4 గంటలలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యలు ఉంటాయాని వెల్లడించారు.
తెలుగు 2, వాణిజ్య శాస్త్రం 2, జంతుశాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఒకటి, కంప్యూటర్ సైన్స్ 2 ఖాళీలున్నట్లు తెలిపారు.ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. డెమో, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
ఓసి, బీసీలు సంబంధిత పోస్ట్ గ్రాడ్యూయేషన్ సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలని అన్నారు. పిహెచ్. డి, నెట్, సెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి..!
-
Heavy Rain : వర్షం బీభత్సం.. నేలకొరిగిన మొక్కజొన్న..!
-
Food Safety : ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీ.. నిల్వ ఉంచిన చికెన్ దుర్వా సన.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు..!
-
Tamarind : చింతపండుతో ఆరోగ్యమేనా.. తెలుసుకోండి..!
-
Suryapet : బంగారం చోరీ దొంగ అరెస్ట్..!









