Jagan : అన్నివర్గాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి..!
Jagan : అన్నివర్గాలు బాగుపడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి..!
జడ్పీటీసీ రామచంద్రా రెడ్డి
రామసముద్రం, మనసాక్షి:
రామసముద్రం మండల కేంద్రం లోని ఆర్ నడింపల్లెలో జడ్పీటీసీ సి హెచ్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో ప్రతి ఇంటిని కరోనా టైమ్ లో కూడా తన స్వంత ఇంటి లా బావించి కులం, మతం ప్రాంతము రాజకీయ వర్గం చూడకుండా వాలంటీర్లు వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్లే పేదవాడి గడపకు వచ్చి సేవ చేసే విధంగా చూసిన ఘనత ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
అదిచూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ లు కూటమిగా ఏర్పడి పేదవాడికి మేలు చేసే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.ప్రజలు అంత గమనించి సంక్షేమo ఇలా నే కొనసాగాలంటే మీ పిల్లలు భవిష్యత్తు బాగుపడాలంటే అవ్వ తాత లకు ప్రతి నెల ఒకటవ తేదీన సూర్యోదయం పుట్టక మునుపే వాలంటీర్లు ద్వారా పెన్షన్ అందాలంటే జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్య మంత్రి కావాలి.
నియోజకవర్గ ప్రజలకు ఈనెల 13న జరగబోయే సార్వాత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ ఎంపి అభ్యర్థి మిథున్ రెడ్డిలను గెలిపించాలని ఆయన పిలిపునించారు. మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభ్యర్థులు గెలుపుకోసం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నా జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వెంకటప్ప,సర్పంచ్ నరసింహులు,లక్షమన్న, వెంకటరమణ,రెడ్డెప్ప,శ్రీ నివాసులు,,వెంకటస్వామి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ALSO READ :
Chiranjeevi : ఏపీ ఎన్నికలపై చిరంజీవి ఏమన్నారు.. వైరల్ గా మారిన కామెంట్స్.. (వీడియో)









