మిర్యాలగూడ : నిజాయితీచాటుకున్న హోమ్ గార్డ్
మిర్యాలగూడ : నిజాయితీచాటుకున్న హోమ్ గార్డ్
మిర్యాలగూడ , ఆగస్టు 31 , మన సాక్షి :
రాఖి పండగ సందర్బంగా మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్. ఐ.మోహన్ బాబు ఆదేశాను సారాంగా హోమ్ గార్డ్ కోడిరెక్క. కిరణ్ కుమార్ ఆర్. టి. సి. బస్సు స్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అక్కడ ఒక మనీ పర్సు దొరికింది.
అందులో 37,000 వేల రూపాయల నగదు మరియు ఆధార్ కార్డు బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ వున్నాయి దానిలో వున్నా అడ్రస్ ప్రకారముగా ఎస్. ఐ. సదరు వ్యక్తి గుండా నవీన్ రాంనగర్ బంధం నివాసిగా గుర్తించి ఎస్. ఐ అట్టి పరుసు పోగొట్టుకున్న వ్యక్తిని పిలిచి విచారించి హోమ్ గార్డ్ చేతుల మీదుగా అందించటం జరిగింది.
ALSO READ :
- THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!
- రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!
- Theft : 15 ఏళ్లుగా 45 చోరీలు.. జైలు శిక్ష..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
- Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
సదరు నవీన్ ట్రాఫిక్ ఎస్. ఐ. కి హోమ్ గార్డ్ కిరణ్ కు మరియు సిబ్బంది కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. విషయం తెలుసుకున్న పెద్దలు పోలీస్ వారు చేసిన ఈ మంచి పనిపట్ల హర్షతిరేఖలు వెలిబుచ్చి సదరు హోమ్ గార్డ్ కిరణ్ కు అభినందనలు తెలిపినారు. ఎస్. ఐ. మాట్లాడుతూ పోలీస్ వారు నిజాయితీకి మారు పేరు అని ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు అని కొనియాడారు.









