Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!

Budget 2025 : కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే.. తెలుసుకోండి..!

మన సాక్షి :

కేంద్ర ప్రభుత్వం 2025 – 26వ ఆర్థిక సంవత్సర బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వివిధ రంగాల ప్రోత్సాహకాలను అందించారు. అయితే మధ్యతరగతిలో పాటు వేతనం పొందే వారికోసం ఆమె శుభవార్త అందించారు. బడ్జెట్ తర్వాత ఏ వస్తువులకు ధరలు తగ్గుతాయి.. ఏ వస్తువులకు పెరుగుతాయనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం…

ధరలు తగ్గే వస్తువులు :

క్యాన్సర్ చికిత్సకు అందజేసే మూడు రకాల ఔషధాలకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు కలిగింది.

కోబాల్ట్ పౌడర్, నిత్యం అయాన్, బ్యాటరీ తుక్కుతో పాటు జింక్ మరియు 12 రకాల క్రిటికల్ మినరల్స్ ను ట్యాక్స్ మినహాయించింది.

నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీద కస్టమ్స్ డ్యూటీ పది సంవత్సరాలపాటు

తోలు తో పాటు తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి.

ఎల్ఈడి, ఎల్సిడి టీవీల రేట్లు కూడా తగ్గనున్నాయి.

మొబైల్ ఫోన్లు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు కూడా తగ్గనున్నాయి.

ప్రోజెన్ చేపలు, చేపల పేస్టుకు సంబంధించిన ధరలు కూడా తగ్గుతాయి.

భారతదేశంలో తయారయ్యే బట్టల ధరలు కూడా తగ్గనున్నాయి.

ధరలు పెరిగే వస్తువులు ఇవే..

దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరుగుతాయి.

విలాసవంతమైన పడవల ధరలు పెరగనున్నాయి.

ఇంపోర్టెడ్ చెప్పుల ధరలు కూడా పెరుగుతాయి.

స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీల ధరలు కూడా పెరగనున్నాయి.

MOST READ : 

  1. TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ పై అప్డేట్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

  2. TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

  3. ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!

  4. సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!

మరిన్ని వార్తలు