మిర్యాలగూడ : రాచమల్ల శ్రీను కు ఉస్మానియా డాక్టరేట్
మిర్యాలగూడ : రాచమల్ల శ్రీను కు ఉస్మానియా డాక్టరేట్
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామ నివాసి కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంధాలయ సమాచార శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న రాచమల్ల శ్రీను కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పొందారని ప్రిన్సిపల్ డాక్టర్ బిక్షమయ్య తెలియజేశారు.
ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్శిటీ నుండి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిరందాస్ యాదగిరి పర్యవేక్షణలో ” మేనేజ్మెంట్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎల్ట్రానిక్ కలెక్షన్ ఇన్ యూనివర్శిటీ లైబ్రరీస్ తెలంగాణ ఏ స్టడీ ” అనే పరిశోధక గ్రంథాన్ని సమర్పించి నందుకు గాను డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు.
ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!










