Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సూర్యాపేట జిల్లాBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Suryapet : మట్టపల్లి బ్రిడ్జి మీదుగా ఆంధ్రకు తరలుతున్న రేషన్ బియ్యం.. భారీగా పట్టుకున్న తెలంగాణ పోలీసులు..!

Suryapet : మట్టపల్లి బ్రిడ్జి మీదుగా ఆంధ్రకు తరలుతున్న రేషన్ బియ్యం.. భారీగా పట్టుకున్న తెలంగాణ పోలీసులు..!

మఠంపల్లి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు అధ్వర్యంలో స్పెషల్ పోలీస్ లతో కలిసి అక్రమ రేషన్ బియ్యం రవాణా పై మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.

మఠంపల్లి మండలం నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా మూడు బొలెరో వాహనంలో 90 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు,

పోలీసుల అదుపులో ముగ్గురు డ్రైవర్లు, 12 మంది కూలీలు ఉన్నారు. వారిలో  ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుభాని, మిర్యలగూడెంకు చెందిన వ్యక్తి , మఠంపల్లి మండలం కొత్త తండాకు చెందిన వ్యక్తులను గుర్తించి అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు మాట్లాడుతూ అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తే కట్టిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు