ప్రధానమంత్రి మోడీతో రేవంత్ రెడ్డి భేటీ.. దాని కోసమేనా..!
ప్రధానమంత్రి మోడీతో రేవంత్ రెడ్డి భేటీ.. దాని కోసమేనా..!
మన సాక్షి, న్యూఢి ల్లీ :
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగా పూర్తి చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి అందజేసిన వినతి పత్రంలోని ముఖ్యంశాలు..
1. హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIని రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ. ఐదు కారిడార్లకు మంజూరు చేయాలి.
2. RRR దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలి. దక్షిణ భాగానికి భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
3. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు నిధులు అందించాలి. ఇసా మరియు మూసీ నదుల సంగమం వద్ద బాపు ఘాట్ అభివృద్ధి, మూసీ శుద్ధి కోసం 27 STPల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కట్టల నిర్మాణం మరియు మూసీ మరియు గోదావరి నదుల అనుసంధానం కోసం రూ. 20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించండి. ఈ ప్రాజెక్టుకు రూ. 20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించండి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షిత భూముల బదిలీకి సహకరించండి.
4. రీజినల్ రింగ్ రైల్… డ్రై పోర్టులను మంజూరు చేయండి.
5. హైదరాబాద్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయండి. సెమీకండక్టర్ మిషన్ను అనుమతించండి.
6. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, రాష్ట్రంలో నగరాల పెరుగుదల మరియు ఇతర అవసరాల దృష్ట్యా, తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయండి.
MOST READ :
-
MLC Elections : రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం.. ఇవీ ఏర్పాట్లు..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
Gold Price : చాలా రోజుల తర్వాత.. భారీగా పడిపోయిన పసిడి ధర..!









