దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కొడుకుకు గాయాలు.. న్యాయం కోసం రహదారిపై ధర్నా..!
దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కొడుకుకు గాయాలు.. న్యాయం కోసం రహదారిపై ధర్నా..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం..
మాడుగుల మండలం అందుగుల గ్రామానికి చెందిన
అవాంచ శేఖర్ చారి(40) తన కుమారుడితో దేవరకొండ లోని అయ్యప్ప స్వామి దేవాలయం కు స్వామి మాల ధరించేందుకు బుధవారం తెల్లవారుజామున వచ్చారు. దేవాలయం ముందు టూ వీలర్ పై ఉన్న వారిని అశోక్ లేలాండ్ లారీ ఢీ కొట్టింది.
దాంతో ఇరువురిని ఆసుపత్రికి తరలించగా శేఖర్ కు సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం చేయాలని బంధువుల ధర్నా, రాస్తారోకో :
మాడుగుల మండలం అందుగుల గ్రామానికి చెందిన అవాంచ శేఖర్ చారి బ్రతుకు దెరువు కోసం కల్వకుర్తికి వెళ్లి బంగారం షాపు పెట్టుకుని జీవనాధారం సాగుస్తున్నారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. దాంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచాయి.
MOST READ :
-
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
-
Suryapet : రికార్డు స్థాయిలో దీక్ష స్వీకరించిన స్వాములు.. కిక్కిరిసిన శబరినగర్..!
-
Miryalaguda : సన్నధాన్యంకు రూ.500 బోనస్ లో మెలిక.. రైతులకు అందని ద్రాక్ష.!
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!









