TG News : తెలంగాణలో రేపు పాఠశాలలు బంద్..!
TG News : తెలంగాణలో రేపు పాఠశాలలు బంద్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30వ తేదీన ప్రభుత్వ పాఠశాలల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు బంద్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అతి ముఖ్యమైన విద్యాశాఖ మంత్రి లేకుండా కొనసాగడం ఒక సంవత్సరం పూర్తయిందని అన్నారు. కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం లేదన్నారు. అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 30వ తేదీన పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
MOST READ :
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. అయోమయంలో రైతులు..!
Gold Price : మళ్లీ పసిడి తగ్గింది.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!
Runamafi : రుణమాఫీ పై లేటెస్ట్ అప్డేట్.. రూ. 3వేల కోట్లు రిలీజ్..!









