సోమప్ప దేవాలయ హుండీ లెక్కింపు, ఎంత వచ్చిందో తెలుసా ?
సోమప్ప దేవాలయ హుండీ లెక్కింపు, ఎంత వచ్చిందో తెలుసా ?
నేరేడుచర్ల , మనసాక్షి:
బృగు మాలిక సోమేశ్వర స్వామి దేవస్థానం సోమారం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా సంవత్సరం హుండీ లెక్కించారు.
ఒక లక్ష 32 వేల 552 మరియు లడ్డు పులిహార ద్వారా 75000,కొబ్బరికాయల ద్వారా 85000,టికెట్ల ద్వారా 74 వేల 775 రూపాయలు మొత్తం రూపాయలు,మూడు లక్షల 67 వేల 337 రూపాయలు వచ్చినవి.
హుండీ లెక్కింపు నందు పరిశీలకులు ఈ.రమేష్,మిర్యాలగూడ పర్యవేక్షణలో ఆలయ అధికారి కొంకపాక మృత్యుంజయ శాస్త్రి,చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, ధర్మకర్తలు పెండం సైదులు, లక్ష్మీనారాయణ, పురాణ వీరప్ప, ఆలయ పూజారి ఇరుగంటి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ అనంతు శ్రీనివాస్ గౌడ్, వార్డ్ నెంబర్ పాల్వాయి వెంకటయ్య, కొత్త లక్ష్మణ్, కందిబండ శ్రీనివాస్,గజ్జల కోటేశ్వరరావు, రాచకొండ శ్రీనివాసరావు, నీలా రామ్మూర్తి,మాలోతు నాగు, అనిల్, రవి, వినోదు,నాగేశ్వరరావు, విక్రం, సోములు, సీతయ్య భక్తులు పాల్గొన్నారు.









