Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డివికారాబాద్ జిల్లా

శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వివిధ మండలాల అధ్యక్షులు

శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న వివిధ మండలాల అధ్యక్షులు

కుల్కచర్ల,మన సాక్షి:

2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గెలుపు కొరకు జ్యోతిర్లింగాల్లో ఒకటి అయినా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని మొక్కుబడిని పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల సహచర అధ్యక్షులు ముక్కడం జరిగింది.

ఈ సందర్భంగా కుల్కచర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు మాట్లాడుతూ.. రామ్మోహన్ రెడ్డి గెలుపుకు మొక్కుబడిగా స్వయంభు వెలసిన ప్రాచీన ప్రసిద్ధి గాంచిన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి లింగానికి ఆభిషేకం చేయడం జరిగింది.

అలాగే రామ్ మోహన్ రెడ్డి కి మంత్రి పదవి రావాలని మరియు పరిగి ప్రజలు ఎల్లప్పుడు సుఖశాంతులతో ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో తులతూగాలని, పాడిపంటలు అధికంగా పండాలని, కరువు లేని పరిగి నియోజకవర్గంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, చౌడపూర్ మండల అధ్యక్షులు ఏల్పాటి అశోక్ కుమార్ దోమ పరిగి పూడూర్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.

ALSO READ : సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు.. హై కమాండ్ స్పష్టం..!

మరిన్ని వార్తలు