Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు

Karimnagar : సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు.. దోపిడీ కేసు చేదించిన పోలీసులు..!

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు.

Karimnagar : సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులు.. దోపిడీ కేసు చేదించిన పోలీసులు..!

మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం

కరీంనగర్ జులై 29, మనసాక్షి :

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును కరీంనగర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం, నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.

నిందితులు దోపిడీ అనంతరం దొంగిలించిన ద్విచక్ర వాహనాలపై హుజురాబాద్ వైపు వెళ్లి, పెద్ద పాపయ్యపల్లి సమీపంలో వాటిని వదిలివెళ్లినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన వారని పోలీసులు నిర్ధారించారు.

యూపీలో ప్రత్యేక బృందాల గాలింపు – ముగ్గురు అరెస్ట్

దర్యాప్తులో భాగంగా కరీంనగర్ పోలీసుల ప్రత్యేక బృందాలు మీరట్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ముగ్గురు నిందితులను జూలై 29న అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సల్మాన్ అలియాస్ భూరే యాదవ్ (22), సల్మాన్ అలియాస్ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19), వారి వద్ద నుంచి రూ.2,09,000 నగదు 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు 64.98 గ్రాముల వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సొంత అల్లుడు, మనుమడే కుట్రకు సూత్రధారులు

దర్యాప్తులో బాధితుడు ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్ (ఎ1), మనుమడు అజీమ్ రజా (ఎ2) ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు ఇతర నేర కేసులు నమోదై ఉన్నాయి. కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి వెళ్లాడు.

అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు.

కరీంనగర్‌లో బాధితుడి ఇంట్లో నివసించిన సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మరియు మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. ఈ నెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.

పరారీలో ప్రధాన నిందితులు

అరెస్టయిన ముగ్గురు నిందితులను మీరట్ గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు రజావుద్దీన్ (ఎ1), అజీమ్ రజా (ఎ2) తో పాటు ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని సీపీ తెలిపారు

మరిన్ని వార్తలు